Header Banner

ఎన్నికల హామీ నెరవేర్చిన లోకేష్! విద్యార్ధులకు భారీ ఊరట!

  Mon May 05, 2025 14:33        Politics

ఏపీలో గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల తరపున టీడీపీ నేత నారా లోకేష్ విద్యార్ధులకు, వారి తల్లితండ్రులకు ఓ కీలక హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. వచ్చే నెలలో కొత్త విద్యాసంవత్సరం మొదలుకాబోతున్న నేపథ్యంలో విద్యార్థులపై ఓ భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు దీన్ని అమల్లో కూడా పెట్టేసింది. దీంతో కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్ధులు సంతోషంగా స్కూళ్లకు పరుగులు తీయబోతున్నారు.

 

రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో విద్యార్ధుల స్కూలు బ్యాగ్ ల భారాన్ని తగ్గిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇలాంటి హామీలు ఇవ్వడం మామూలే అని అంతా భావించారు. అధికారంలోకి వచ్చాక గతేడాది దీనిపై వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు కొత్త విద్యాసంవత్సరం నుంచి విద్యార్దులపై పుస్తకాల భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది అమల్లోకి కూడా వచ్చేసింది.

 

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 1,2 తరగతుల విద్యార్ధులకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ కలిపి ఒక పుస్తకంగా, వాటి వర్క్ బుక్ లు కలిపి మరో పుస్తకంగా తయారు చేశారు. దీంతో ఈ రెండు తరగతుల విద్యార్ధులు కేవలం రెండు పుస్తకాలను తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే 3,4,5 తరగతుల విద్యార్ధులకు గతంలో నాలుగు బుక్స్, నాలుగు వర్క్ బుక్ లు ఉండేవి. ఇప్పుడు వాటిని కుదించారు. కొత్త విధానంలో తెలుగు--ఇంగ్లీష్ ఒక పుస్తకంలో, మ్యాథ్స్-ఈవీస్ మరో పుస్తకంలో ఉండేలా తయారు చేశారు. వీటి వర్క్ బుక్ లనూ ఇదే విధానంలో ముద్రించారు. దీంతో ఈ మూడు క్లాస్ ల విద్యార్ధులూ 4 పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లనున్నారు.

 

వాస్తవానికి దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఈసారి మాత్రం నారా లోకేష్ ఓ స్పష్టమైన మార్పు తెచ్చారు. దీంతో విద్యార్దులపై పుస్తకాల భారం సగానికి సగం తగ్గిపోయింది. సెమిస్టర్ విధానం వల్ల కొంత, పుస్తకాలు కలిపేయడం వల్ల మరికొంత భారం తగ్గింది. దీంతో కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్ధులకు భారీ ఊరట దక్కినట్లయింది.

 

ఇది కూడా చదవండి: జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LighterSchoolBags #StudentRelief #TDPForEducation #BackToSchoolHappy #BookBurdenCut #EducationReform